అఖిల్ హ్యట్రిక్ సాధించాడు. ఫ్లాపుల్లో! అవును అఖిల్ నటించిన మూడో చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద గల్లంతయింది. "మిస్టర్ మజ్ను".. మొదటి వీకెండ్ మోస్తరు కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత పికప్ కాలేదు. మొత్తంగా ఇపుడు ఫ్లాప్ అని ట్రేడ్ పండితులు డిక్లేర్ చేశారు. ఐతే సినిమాని కాపాడాలని తన వంతు ప్రయత్నంగా అఖిల్..ఆంధ్రాలో టూర్ వేశాడు. ప్రమోషన్ చేస్తున్నాడు.
హీరోలంతా ఇప్పుడు భలేగా కలిసిపోతున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్ కు మరొకరు ప్రత్యేక అతిథులుగా హాజరై అన్యోన్యత చాటుకుంటున్నారు. మొన్నటికిమొన్న "భరత్ అనే నేను" సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్, ఈసారి అఖిల్ తో కలిసి వేదిక పంచుకోబోతున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎల్లుండి (19-శనివారం) "మిస్టర్ మజ్ను" ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరవబోతున్నాడు యంగ్ టైగర్.
అఖిల్ నటిస్తున్న మిస్టర్ మజ్నుకి సంబంధించిన గ్లిప్మ్స్ (టీజర్లాంటిదే) వీడియో గతేడాది నవంబర్లో విడుదలైంది. తాజాగా టీజర్ వచ్చింది. రెండింటిలో మేటర్ సేమ్..హీరో కాసనోవా పాత్రలాంటిది అన్నది ఎస్టాబ్లిస్ చేయడమే. ఈ కొత్త టీజర్ ఇంతకుముందు వచ్చిన దానికి మించి ఏమీ చెప్పలేదు, చూపలేదు.