మా అసోషియేషన్ వివాదం ముదిరింది. మా నిధులన్నింటిని శివాజీ రాజా, శ్రీకాంత్ అండ్ టీమ్ మొత్తం తినేసిందని మా కొందరు సభ్యులు ఆరోపణలు చేశారు. రెండు రోజుల పాటు సాగిన వివాదంత ఇపుడు మరింత ముదిరింది.
మా అధ్యక్షుడు శివాజీరాజా ప్రెస్మీట్ పెట్టి మరీ తనపై ఆరోపణలు చేసిన వారికి ఛాలెంజ్ విసిరాడు. నిధులు దుర్వినియోగమైనట్లు నిరూపిస్త నా ఆస్తంతా రాసిచ్చేస్తానని చెప్పాడు. అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కావాలనే కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు శివాజీరాజా.