మహేష్బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం అనేకసార్లు వాయిదాపడింది. ఫైనల్గా ఆదివారం లాంఛనంగా లాంచ్ అయింది. మహేష్బాబు తండ్రి, సూపర్స్టార్ కృష్ణ గచ్చిబౌలిలోని ఎ.ఎం.బి సినిమాస్ మల్టీప్లెక్స్ని ప్రారంభించారు.
మహేష్బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభం మరోసారి వాయిదా పడింది. ఈ మల్టీప్లెక్స్ని అమీర్ఖాన్ నటించిన "థగ్స్ ఆఫ్ హిందూస్తాన్"తోనే ప్రారంభించాలనుకున్నారు కానీ అప్పటికీ థియేటర్ పూర్తిగా రెడీ కాలేదని వాయిదా వేశారు. రీసెంట్గా రజనీకాంత్ "టూ పాయింట్ ఓ"తో మొదలుపెట్టాలని హంగామా చేశారు. కానీ ఇపుడు అదే సమస్య వచ్చిందట.