అనసూయ హీరోయిన్గా నటించిన "కథనం"... "మన్మధుడు 2" సినిమాతో పాటే విడుదలైంది. ఐతే ..అనసూయ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఆ సినిమా విడుదలయిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అనసూయకి క్రేజ్ ఉందని అందరూ అంటారు. కానీ ఆమె సినిమా విడుదలైతే ఒక్క హాల్ కూడా నిండడం లేదు. మరి ఇదేంటి. ఇదే విషయాన్ని మీడియా రాసింది.
కథనం సినిమా ఓపెనింగ్ష్ చూశాక.... అనసూయకి అంత సినిమా లేదన్నది అర్థమయిందన్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఈ అందాల భామ ఫైర్ అవుతోంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మా గాలి తీసేస్తారా అని గుస్సా అవుతోంది.