పైసా ఖర్చు లేకుండా బీభత్సంగా ప్రచారం సంపాదించడం రాజమౌళికి మాత్రమే తెలుసు. బాహుబలితో ఈ విషయం అందరికీ తెలిసొచ్చింది. సరిగ్గా ఇప్పుడు అదే ఫార్ములాను తన నెక్ట్స్ మూవీకి కూడా అప్లయ్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు...రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన తొలి రోజు నుంచే అఫీషియల్ గా ప్రచారం స్టార్ట్ చేశాడు జక్కన్న.