స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడిగా హరికృష్ణ తెలుగు దేశం పార్టీ నేతలకి అత్యంత ప్రియమైన వ్యక్తి. పాత తరం రాజకీయ నాయకులు.. ఆయన్ని చైతన్య రథసారథిగా అభిమానిస్తారు. సినిమా పరిశ్రమ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైతన్య రథం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బస్సు స్టీరింగ్ని చేపట్టింది ఎవరో కాదు ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణనే.