'ఆల వైకుంఠపురంలో' టీం ప్రమోషన్ లో దూకుడు చూపుతోంది. మరి 'సరిలేరు నీకెవ్వరు' టీం సైలెంట్గా ఉంటే ఎలా? ఇదే క్వశ్చన్ వేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అందుకే.. ఫ్యాన్స్ కోసం ఈ దీపావళి పండుగ నాడు ఒక సరికొత్త పోస్టర్ ని, మహేష్ బాబు బ్రాండ్ న్యూ లుక్ తో కూడిన స్టిల్ ని రిలీజ్ చేస్తారట. అభిమానులు ఇక పండుగ చేసుకోవాలిసిందే.
ఈ సినిమాకి సంబందించిన పాటలు మాత్రం ఇప్పుడిప్పుడే వచ్చేలా లేవు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరుస్తున్న ఈ సాంగ్స్ ని రిలీజ్ కి ఒక నెల రోజుల ముందు నుంచి వదిలేలా ఎదో ఓ స్కీం ప్లాన్ చేశారట.
దిషా పటానీ ..తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. తెలుగులో ఆమె పూరి జగన్నాథ్ తీసిన లోఫర్ సినిమాలో నటించింది. ఆమెకి అదే అరంగేట్రం. తెలుగులో సక్సెస్ కాలేదు కానీ బాలీవుడ్లో ఇపుడు యమా పాపులర్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దీనికి రీజన్ ఏంటంటే ఆమె తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
రామ్చరణ్ - బోయపాటి సినిమా మొదటి లుక్ వచ్చేస్తోంది అంటూ గత ఆగస్ట్ 22 నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఎప్పటికపుడు కొత్త డేట్ల ప్రచారం, ఆ డేట్కి రాకపోవడం అనేది కామన్ అయింది. మొదట మెగాస్టార్ బర్త్డేకి (ఆగస్ట్ 22) వస్తుందన్నారు. ఆ తర్వాత బాబాయ్ పవన్ కల్యాణ్ బర్త్డేకి (సెప్టెంబర్ 22) అన్నారు. వెంటనే వినాయక చవితి (సెప్టెంబర్ 13) చెప్పారు. ఆ తర్వాత దసరాకి పక్కాగా అని ఊదరగొట్టారు.