మొన్న రామ్ డబుల్ దిమాగి అన్నాడు. ఇప్పుడు డబులు కా మీఠా అంటున్నాడు.
తన బుర్రలో వేరే వాడి చిప్ పెట్టుకొని ఇస్మార్ట్ శంకర్ గా అదరగొట్టాడు. ఇక ఇప్పుడు కెరీర్లో ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చెయ్యబోయే సినిమా ఒక రీమేక్. తమిళంలో రూపొందిన 'తడం' (పాద ముద్ర) అనే సినిమాని తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు కిశోర్ తిరుమల తీసే ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. హీరోయిన్లు కూడా ఇద్దరు ఉంటారు. అంటే డబల్ గ్లామర్.