రాంగోపాల్ వర్మ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచింది "క్షణక్షణం". "శివ సినిమా కన్నా "క్షణక్షణం" సినిమానే ఎక్కువ మంది చూశారు టీవీల్లో. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎం.ఎం.కీరవాణి. ఆ తర్వాత ఆయన 200కి పైగా సినిమాలకి పాటలు అందించారు. వర్మ ఇపుడు తీస్తున్న సినిమాలని కానీ, ఆయన సినిమాల్లోని ఇప్పటి పాటలు కానీ చూసినపుడు... ఆయన టేస్ట్కి ఏమైంది అనిపిస్తుంది. "క్షణక్షణం", "రంగీలా", "గాయం", "దౌడ్", "సత్య" వంటి సినిమాల్లో పాటలు ఆయనే చేయించుకున్నాడా అన్న డౌట్స్ కూడా వస్తాయి. అంత గొప్పగా ఉండేవి ఆయన సినిమాల్లో ఒకపుడు పాటలు.