లెజండరీ సింగర్ కె.జె.ఏసుదాస్ చాలా కాలం తర్వాత హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. జనవరి 20న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్తోపాటు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో జనవరి 19న కె.జె.ఏసుదాస్, ఆయన తనయుడు విజయ్ ఏసుదాస్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.