దేశంలో మొట్టమొదటి టెర్రరిస్ట్ హిందూవే అంటూ కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా ఆయనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కమల్ హాసన్పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలను పలు రాజకీయ పార్టీల నేతలు తప్పు పట్టారు.