కేరళ వరదల ప్రళయానికి చలించిన టాలీవుడ్ తారలు అందరూ భారీ విరాళాన్ని అందించారు. మన అగ్ర హీరోలెవ్వరికీ కేరళలో పెద్ద మార్కెట్ లేదు. కోలీవుడ్ హీరోల సినిమాలతో పోల్చితే మన సినిమాలు పెద్దగా ఆడవు. ఐనా కానీ మన వారు అవేవీ ఆలోచించలేదు. ఉదారంగా విరాళాలు ఇచ్చి తమ గొప్ప హార్ట్ని చాటుకున్నారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్బాబు, అల్లు అర్జున్, రామ్చరణ్, ఎన్టీఆర్, నాగార్జున. ఇలా అందరూ పాతిక లక్షల చొప్పున విరాళాలు ఇచ్చారు. కల్యాణ్రామ్, రామ్, విజయ్ దేవరకొండ వంటి ఇతర హీరోలు కూడా పది నుంచి ఐదు లక్షల వరకు అందించారు. వారు ప్రకటించిన విరాళాలు అన్ని మీడియాలో వచ్చాయి.