నందమూరి సుహాసిని కోసం నందమూరి బాలకృష్ణ ప్రచారంలోకి దిగాడు. ఆమెతో పాటు ఇతర తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తరఫున మరో రెండు రోజులు ప్రచారం చేయనున్నాడు బాలయ్య. ఐతే, సుహాసిని కోసం కల్యాణ్రామ్, జూనియర్లో చివరి నిమిషంలో రంగంలోకి దిగుతారని ఇప్పటి వరకు టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి, ఆ పార్టీ కలాపాలకి గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ని ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలోకి దించాలని వ్యూహం పన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కల్యాణ్రామ్ కుటుంబంలో ఒకరికి టికెట్ వస్తే జూనియర్ తన బెట్టుని గట్టు మీద పెట్టక తప్పదని బాబుకి తెలుసు. తాజా సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ కూకట్పల్లిలో ప్రచారం చేసేందుకు అంగీకరించాడట. అంటే బాబు ప్లాన్ ఫలించింది.
నందమూరి కల్యాణ్రామ్ని ఈసారి తెలంగాణ ఎన్నికల బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని కీలకమైన నియోజకవర్గమైన కూకటపల్లి నుంచి కల్యాణ్రామ్ని బరిలోకి దింపాలని ఇంతకుముందు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు. ఐతే కల్యాణ్రామ్ ఈ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించాడు.