రాంగోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" వివాదాలు క్రియేట్ చేస్తోంది. కోర్టు కేసులనూ ఆహ్వానిస్తోంది. వర్మకి కావాల్సింది కూడా అదే. ఎంత వివాదం రేగితే, సినిమాకి అంత మంచిది. అదే వర్మ పాటించే పబ్లిసిటీ సూత్రమిదే. ఆయన ఊహించినట్లే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ సినిమాపై హైకోర్టుని ఆశ్రయించారు.
ఒక సినిమాలో దేవినేని నెహ్రు. మరో సినిమాలో వైఎస్సార్. ఇపుడు చంద్రబాబు నాయుడు. ఒకే నటుడు..ఇలా ముగ్గురు రాజకీయ నేతల పాత్రల్లో. శ్రీతేజ్ అనే యువ నటుడు ఇపుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబునాయుడు పాత్ర పోషించనున్నాడు. ఈ ఫోటోలను వర్మ విడుదల చేశాడు.
ఈ నటుడు ఇంతకుముందు వర్మ తీసిన వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించాడు. అలాగే తాజాగా క్రిష్ తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో డాక్టర్ వైఎస్సార్గా కనిపించాడు. మూడు పాత్రల్లోనూ ఆయా వ్యక్తుల పోలీకలను రాబట్టడం నిజంగానే విశేషమే.