నాగశౌర్య సినిమాని ఆ నిర్మాత మధ్యలోనే వదిలేశాడు. ఎన్నికల ఖర్చుకి డబ్బులు కావాల్సి ఉంటుందని ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాని పక్కన పెట్టాడు నిర్మాత ఆనంద ప్రసాద్. అప్పటికే నర్తనశాల అట్టర్ఫ్లాప్లో ఉన్న నాగశౌర్యకి అది షాక్లా తగిలింది. నర్తనశాల ఫ్లాప్ కావడం వల్లే ఆనంద ప్రసాద్ భయపడిపోయి సినిమాని మిడిల్డ్రాప్ చేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే నాగశౌర్యకి ఎక్కడో లక్ ఉంది. ఈ సినిమా మళ్లీ మొదలు కానుందట.