రాజకీయ పరిశీలకులు ఊహించినట్లే.. నందమూరి హరికృష్ణ కూతురిని ఎన్నికల బరిలోకి దింపుతోంది తెలుగుదేశం పార్టీ. హరికృష్ణ కూతురు సుహాసిని పేరుని కూకట్పల్లి అభ్యర్థిగా ఆ పార్టీ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్న తొలి వ్యక్తిగా సుహాసిని నిలవనున్నారు. ఆమె మామ చుండ్రు శ్రీహరి మాజీ ఎంపీ.
నందమూరి హరికృష్ణకిఅశ్రునయనాలతో వీడుకోలు పలికింది అభిమాన గణం.. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్రామ్ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్తో పాటు పలువు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
నందమూరి హరికృష్ణ అకాల మరణంతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా విడుదల తేదీ మారుతుందా? ఇదే ప్రశ్న అభిమానుల మదిలో మొదలుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తోన్న "అరవింద సమేత" ఈ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఐతే తన తండ్రి హరికృష్ణ మరణంతో.. జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల పాటు షూటింగ్కి దూరంగా ఉండక తప్పదు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడిగా హరికృష్ణ తెలుగు దేశం పార్టీ నేతలకి అత్యంత ప్రియమైన వ్యక్తి. పాత తరం రాజకీయ నాయకులు.. ఆయన్ని చైతన్య రథసారథిగా అభిమానిస్తారు. సినిమా పరిశ్రమ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్టీఆర్ ..ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం షెవర్లెట్ వాహనాన్ని మాడిఫై చేసి, దానికి చైతన్య రథం అనే పేరు పెట్టారు ఎన్టీ రామారావు. ఆ బస్సు స్టీరింగ్ని చేపట్టింది ఎవరో కాదు ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణనే.