ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి "సాహో". మరోటి జిల్ రాధాకృష్ణకుమార్ డైరక్షన్లో. ఈ రెండో సినిమాకి "అమోర్" అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అమోర్ అనే ఆ ఫ్రెంచ్ టైటిల్ ఎంత మందికి అర్ధమవుతుందనే సంశయంతో ఇపుడు "జాను" అనే టైటిల్ని ఫిక్స్ చేశారట. "జాను" అనే ఈ టైటిల్ క్యాచీగా ఉండడం, రెండక్షరాల టైటిల్ కావడంతో ప్రభాస్ దీనికి ఫిక్స్ అయ్యాడనేది టాక్.
"మనం" సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగార్జున పాత్ర గుర్తుందా. ఓ జమీందార్ పాత్రలో కనిపించిన నాగార్జునకు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చితే ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా ఆ కారును సొంతం చేసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి పాత్రనే ఇప్పుడు ప్రభాస్ కూడా పోషిస్తున్నాడు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో వింటేజ్ కార్లు కొనే ధనవంతుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ వివరాల్ని స్వయంగా వెల్లడించాడు.
ప్రభాస్ నటిస్తున్న "సాహో" షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎపుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో ప్రభాస్కి కూడా క్లారిటీ లేదు. చేసుకుంటూ వెళ్లడమే. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదు. "బాహుబలి" తర్వాతి మూవీ ఇదే కావడంతో గ్రాండ్గా ఉండాలని తపిస్తున్నాడు ప్రభాస్. ఐతే మరోవైపు, ప్రభాస్కి ఇతర నిర్మాతలతో పాటు ఇంట్లో నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంది. మరో సినిమా మొదలుపెట్టాలనేది ప్రెషర్.