మన పూరి జగన్నాధ్.. బాలయ్యను వదలట్లేదు. ఇప్పటికే బాలయ్యను తేడా సింగ్ గా చూపించిన పూరి, ఇప్పుడు మరో సినిమా కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. దీని కోసం అతడు చేస్తున్న ప్రయత్నాలు క్లియర్ గా తెలిసిపోతున్నాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కాగానే బాలయ్యకు మొట్టమొదట వెళ్లిన కాల్ ఎవరిదో తెలుసా? ఆ కాల్ చేసిన వ్యక్తి పూరి జగన్నాధ్. సినిమా చూశానని, సాక్ష్యాత్తూ పెద్ద ఎన్టీఆర్ ను చూసినట్టు ఉందంటూ పూరి, బాలయ్యను పొగిడేశాడు.