రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా సినిమా మొదలైంది. దాసరి లారెన్స్ దర్శకత్వంలో మావురం రజిని నిర్మాతగా ఆదివారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా, హీరో సందీప్ కిషన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు.