అక్కినేని యువ సమ్రాట్ నాగ్ చైతన్యకి తన గురించి, తన మార్కెట్ గురించి పూర్తి అవగహన ఉన్నట్లుంది. తనతో భారీ సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకురారు అని చైతన్యకి తెలుసు. అందుకే, "సవ్యసాచి" సినిమా విషయంలో చై సర్ప్రైజ్ అయ్యాడు. "మైత్రీ సంస్థ కాబట్టే ఇంత భారీగా తీయగలిగింది. మాధవన్, భూమిక, కీరవాణి.. ఇలా భారీ ప్యాడింగ్ తోడు అయిందంటే కారణం ఆ సంస్థే," అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.