నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి, ఆ పార్టీ కలాపాలకి గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ని ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలోకి దించాలని వ్యూహం పన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కల్యాణ్రామ్ కుటుంబంలో ఒకరికి టికెట్ వస్తే జూనియర్ తన బెట్టుని గట్టు మీద పెట్టక తప్పదని బాబుకి తెలుసు. తాజా సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ కూకట్పల్లిలో ప్రచారం చేసేందుకు అంగీకరించాడట. అంటే బాబు ప్లాన్ ఫలించింది.
బాబూమోహన్ బీజేపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టాడు. తెలంగాణలోని ఆంథోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇదే నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఐతే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్, మహాకూటమి మధ్యే మెయిన్ పోటీ ఉంది. బీజేపీకి కొన్ని పాకెట్స్లోనే బలముంది. ఆ బలమున్న నియోజకవర్గాల్లో ఆంధోల్ లేదు. దాంతో బాబూమోహన్ సోలోగా ప్రచారం చేసుకుంటున్నాడు.