అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతోన్న "మిస్టర్ మజ్ను" సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. సినిమాలో ఒక్క సీన్కి, ఒక షాట్కి కట్ చెప్పలేదట.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని డైరక్ట్ చేశాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత.