చంద్రసిద్దార్థ్ తీసిన "ఆట గదరా శివ"తో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ శంకర్. అతని రెండో చిత్రం తాజాగా ప్రారంభం అయింది. తమిళనాట తక్కువ కాలంలోనే చాలా పేరు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తమిళనాట హీరో విజయ్ ఆంటోనితో 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.