ఇటీవల "ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమాలో బసవతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్ 40ల్లోకి అడుగుపెట్టింది. 40 అంటే ఆంటీ పాత్రలు తప్ప భామ పాత్రలు దక్కవు. కానీ తనకి ఆ ఇబ్బంది లేదంటోంది. స్త్రీలు ఏజ్ పెరుగుతుంటే బెటర్గా అవుతుంటారని అని చెపుతోంది విద్య.
ఫిల్మ్ఫేర్ మేగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ పత్రిక కోసం సెక్సీగా ఫోటోసూట్ చేసింది. నా ఫ్రెండ్ ఒకరు అన్నారు. 35 దాటిన తర్వాత స్త్రీలు ఇతరుల మెప్పు పొందాలనుకోరు. వారి గురించే ఆలోచిస్తారు. ఇది సూపర్గా ఉంటుంది. ఇతరుల అంచనాలు అందుకోవడం, మెప్పు పొందుకోవాలనుకునే దశ 35 తర్వాత ఎండ్ అవుతుంది. 40ల్లో ఇది ఇంకా బాగుంటుంది.