మహా దర్శకుడు మణిరత్నం ఈ మధ్య కాలంలో తీసిన బెటర్ సినిమాల్లో ఇదొకటి అని పేరు తెచ్చుకొంది "నవాబ్". ఐతే ఆయన హార్డ్కోర్ అభిమానులు మాత్రం మణిరత్నం గొప్పగా తీయలేదని పెదవి విరిచారు. ఆ క్రిటిక్స్ మాట ఎలా ఉన్నా సాధారణ జనానికి బాగానే నచ్చినట్లు కనపిస్తోంది. ఐతే ఈ నచ్చడం అనేది కలెక్షన్ల రూపంలోకి ట్రాన్స్ఫర్ కాలేదు. నవాబు తెలుగులో ఫ్లాప్ అయింది. కలెక్షన్లలో పురోగతి పెద్దగా లేదు.
"చెలియా" సినిమాలో అందంగా, ఒద్దికైన పాత్రలో కనిపించింది ఆదితి రావు. మణిరత్నం ఆమెని అంత సౌందర్యంగా చూపించిన తీరు చాలా మంది దర్శకులకి ఒక ప్రేరణగా నిలిచింది. తాను రాసుకున్న సినిమా హీరోయిన్ పాత్రకి ఆమె అయితేనే బాగుంటుందనుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి. "చెలియా" సినిమా చూసి.. ఆమెని తన "సమ్మోహనం" సినిమాకి తీసుకున్నాడు. అంతేకాదు వరుణ్ తేజ హీరోగా రూపొందుతోన్న "అంతరిక్షం" సినిమాలో ఆమెకి హీరోయిన్ పాత్ర దక్కింది కూడా చెలియా చిత్రంతోనే. ఈ మూడు సినిమాల్లోనూ ఆమె పాత్రలు సంప్రదాయబద్దమైనవే, డేరింగ్ రోల్స్ కాదు.