అనసూయ హీరోయిన్గా నటించిన "కథనం"... "మన్మధుడు 2" సినిమాతో పాటే విడుదలైంది. ఐతే ..అనసూయ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఆ సినిమా విడుదలయిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అనసూయకి క్రేజ్ ఉందని అందరూ అంటారు. కానీ ఆమె సినిమా విడుదలైతే ఒక్క హాల్ కూడా నిండడం లేదు. మరి ఇదేంటి. ఇదే విషయాన్ని మీడియా రాసింది.
కథనం సినిమా ఓపెనింగ్ష్ చూశాక.... అనసూయకి అంత సినిమా లేదన్నది అర్థమయిందన్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఈ అందాల భామ ఫైర్ అవుతోంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మా గాలి తీసేస్తారా అని గుస్సా అవుతోంది.
మీటూ వివాదం దేశమంతా మార్మోగుతుండడంతో ప్రతి సెలబ్రిటీ స్పందించక తప్పని పరిస్థితి వచ్చింది. అందాల అనసూయ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. "పని చేసే చోట మహిళలకి వేధింపులు ఉండడం అనేది చాలా కాలంగా చూస్తున్నాం. ఈ ధోరణి మారాలి. తెలుగు చిత్రసీమలో వేధింపులు లేవని చెప్పను కానీ చాలా తక్కువ," అని తన ఒపినియన్ని వెల్లడించింది.
గ్లామర్కి కేరాఫ్ అనసూయ. అలాగే వివాదాలకి కూడా కేరాఫ్. ఎపుడూ ఏదో ఒక మాట అని ట్విట్టర్లో జనంతో విమర్శలను ఎదుర్కొనేది. అలాగే ఆమె అందాల ఆరబోతకి తప్ప నటనకి పనికి రాదనే అభిప్రాయం ఉండేది. "క్షణం" సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసినా.. ఆమెని అందరూ గ్లామర్ భామగానే చూశారు. నటిగా ఎవరూ పరిగణించలేదు.