కమెడియన్ అలీ ఈ సారి ఏపీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నాడు. తన సొంత పట్టణమైన రాజమండ్రి నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ బరిలోకి దిగాలనేది ఆయన డ్రీమ్. గుంటూరు సీటుని ముస్లింలు అధికంగా ఉన్నారనే కారణంతో అడుగుతున్నాడు. మొన్న వైఎస్సార్సీ అధినేత జగన్ని కలిసి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఇపుడు తెలుగుదేశం పార్టీ మంత్రి గంటాని కలిసి మళ్లీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఏ పార్టీలో చేరనున్నాడు? ఏ విషయమైనా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 16న ప్రకటిస్తానని అంటున్నాడు అలీ.