సమ్మర్లోనే సినిమా మొదలుపెట్టాల్సిన బోయపాటికి మొదట బాలయ్య ఝలక్ ఇచ్చాడు. బోయపాటితో బదలు కే.ఎస్.రవికుమార్ తో సినిమా షురూ చేశాడు. ఈ గ్యాప్ లో బోయపాటి పలువురు హీరోలని సంప్రతించాడు కానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఎలాగోలా బాలయ్యతోనే ఒకే చేయించుకున్నాడు. ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించనున్న కొత్త సినిమా ఇటీవలే లాంఛనంగా లాంచ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లుంటారట. ఒక హీరోయిన్గా శ్రియాని తీసుకోనున్నారనేది లేటెస్ట్ టాక్. దర్శకుడు కె.ఎస్.రవికుమార్... ఇంతకముందు బాలయ్యతో తీసిన "జైసింహా" సినిమాలో నయనతార, హరిప్రియని హీరోయిన్లుగా తీసుకున్నాడు. ఈసారి నిర్మాత సీ.కల్యాణ్ సలహా ప్రకారం ఒక హీరోయిన్గా శ్రియాని తీసుకోవాలనుకుంటున్నాడట.