మహేష్బాబు నటిస్తున్న 25వ చిత్రం..మహర్షి. మహేష్బాబుకిది ప్రిస్టిజియేస్ మూవీ. 25వ సినిమాకి రిలీజ్ డేట్ని పక్కాగా ఫిక్స్ చేశాడు నిర్మాత దిల్రాజు. ఏప్రిల్ 25నే విడుదల అవుతుందని మరోసారి ప్రకటించాడు. ఇదే ఫైనల్ డేట్ అని చెప్పాడు.
మొదట మహర్షికి ఏప్రిల్ 5 అని డేట్ ఫిక్స్ చేశారు. ఐతే షూటింగ్లో జాప్యం జరిగింది. దాంతో తేదీ మారింది. మార్చి కల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం. అని దిల్ రాజు వివరించారు.
ఏంటి హెడ్లైన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏమి లేదండి. నమ్రత అలా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశారు. తన భర్త ఇంటికి వచ్చాడని...హి ఈజ్ బ్యాక్...హోమ్ అని ఆనందంగా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంట? వెల్... మహేష్బాబు పొల్లాచ్చి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారన్నమాట.
తెలుగునాట థియేటర్ల మాఫియా ఉందని నిర్మాత ప్రసన్న చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దిల్రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్, సురేష్బాబు, ఏషియన్ సినిమాలదే రాజ్యం అని ఆయన బూతులు తిట్టాడు. ఐతే పేటా సినిమాకి థియేటర్లు దక్కడం లేదని ఆయన చేసిన ఆరోపణలు కొంత విచిత్రంగా ఉన్నాయి. తెలుగు సినిమాలన్నీ చాలా కాలం క్రితమే తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించాయి. కానీ పేట సినిమా నిర్మాత పది రోజుల క్రితం మూవీ కొని, ఇపుడు థియేటర్లు ఇవ్వడం లేదనడం సబబుగా లేదనేది అభిప్రాయం.