చాన్నాళ్ల కిందటే ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. దిల్ రాజు బ్యానర్పై ఆ సినిమా చేయాలనేది ఒప్పందం. అంతా ఓకే అయింది. కథ సెట్ అయింది. నానితో పాటు దుల్కర్ సల్మాన్ కావాలని అనుకున్నారు. దుల్కర్ డేట్స్ లేవని చెప్పాడు. ఆ తర్వాత మరో పెద్ద హీరో కావాలని ఇంద్రగంటి కోరాడు. కానీ దిల్ రాజు మాత్రం ధైర్యం చేయలేకపోయాడు. ఈమధ్య కాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ లో సేఫ్ వెంచర్స్ తీస్తున్న ఈ నిర్మాత.. ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ చేయడానికి కాస్త వెనకంజ వేశాడు.
సుధీర్బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన చిత్రం...`సమ్మోహనం`. ఈ సినిమా క్లయిమాక్స్.. పుస్తకావిష్కరణ గురించే. అందులో తనికెళ్ల భరణి `తారలు దిగి వచ్చిన వేళ` అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. బుజ్జి కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఈ సీన్ సినిమాకి హైలెట్ అయింది. మూవీ విజయం సాధించింది.
Sudheer Babu is all set with his upcoming film ‘Sammohanam’. He plays the role of a person who hates films. The actor talks about the film and also how he is faring as an actor without using any influence from his family.