సినిమాలోని ఒక సీన్ పుస్తకంగా

సుధీర్బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన చిత్రం...`సమ్మోహనం`. ఈ సినిమా క్లయిమాక్స్.. పుస్తకావిష్కరణ గురించే. అందులో తనికెళ్ల భరణి `తారలు దిగి వచ్చిన వేళ` అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. బుజ్జి కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఈ సీన్ సినిమాకి హైలెట్ అయింది. మూవీ విజయం సాధించింది.
ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి `తారలు దిగి వచ్చిన వేళ` పుస్తకం కాపీ కావాలని చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిని అందరూ అడగడం మొదలుపెట్టారట. దాంతో `అనగనగా` పేరుతో మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా ఓ ప్రచురణ సంస్థను మొదలుపెట్టి తొలి ప్రచురణగా `తారలు దిగి వచ్చిన వేళ`ను ప్రచురించారు.
తాజాగా ఈ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. తొలి కాపీని టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ తనయ సితార అందుకున్నారు.
- Log in to post comments