తమిళనాట అమ్మ బయోపిక్లకి డిమాండ్ ఎక్కువగా ఉంది. జయలలిత బయోపిక్ని తీస్తున్నామని ఇప్పటికే ముగ్గురు ఫిల్మ్మేకర్స్ ప్రకటించారు. అందులో ఒక దర్శకరాలు ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు షురూ చేసింది. ఇందులో నిత్యమీనన్ జయలలితగా నటించనుందట.
ఇక దర్శకుడు ఎ.ఎల్.విజయ్ విద్యాబాలన్ కథానాయికగా జయలలిత బయోపిక్ని తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి ఈ సినిమాని తీయనున్నారు.
తమిళనాట కూడా బయోపిక్ల ఫీవర్ పట్టుకొంది. ఐతే అక్కడ వెరైటీ ఏంటంటే ఒక వ్యక్తి బయోపిక్ని నలుగురు ఫిల్మ్మేకర్స్ తీస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ని ఇప్పటికే పలువురు ఫిల్మ్మేకర్స్ అనౌన్స్ చేశారు. అందులో ముందుగా ప్రారంభం అవుతున్న మూవీ.."ది ఐరన్ లేడీ".