సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ విజయం సాధించింది. సినిమా ఫక్తు మసాలా మూవీ. అనిల్ రావిపూడికి దర్శకుడీగా మార్కులు పడలేదు. ఇంకా చెప్పాలంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయి. అయినా ...సినిమా ఎలా ఆడింది? ఒకటి సీజన్ అడ్వాంటేజ్, రెండోది మహేష్ బాబు స్టార్ డమ్, మూడోది టికెట్ ధరలు భారీగా పెరగడం. అలాగే, ఈ సరి లక్ కూడా తోడైయ్యింది. అయితే, అన్ని సార్లు ఇది కుదరదు కదా. అందుకే తన తదుపరి చిత్రం కథ విషయంలో మహేష్ బాబు గట్టిగా ఉన్నాడట.