అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో పవన్ తర్వాత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు హీరోయిన్లు కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్. వీళ్లలో అను ఎమ్మాన్యుయేల్ మోడ్రన్ లుక్ లో కనిపించే శారీలో కనువిందు చేసింది. ఎటొచ్చి కీర్తి సురేష్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ డిఫరెంట్ లుక్, గెటప్ తో ఆడియో ఫంక్షన్ కు వచ్చి అందరికీ షాకిచ్చింది కీర్తిసురేష్. ఎప్పుడు చూసినా అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కీర్తి, ఈసారి మాత్రం ముమైత్ ఖాన్ ను ఫాలో అయింది.