అక్కినేని యువ సమ్రాట్ నాగ్ చైతన్యకి తన గురించి, తన మార్కెట్ గురించి పూర్తి అవగహన ఉన్నట్లుంది. తనతో భారీ సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకురారు అని చైతన్యకి తెలుసు. అందుకే, "సవ్యసాచి" సినిమా విషయంలో చై సర్ప్రైజ్ అయ్యాడు. "మైత్రీ సంస్థ కాబట్టే ఇంత భారీగా తీయగలిగింది. మాధవన్, భూమిక, కీరవాణి.. ఇలా భారీ ప్యాడింగ్ తోడు అయిందంటే కారణం ఆ సంస్థే," అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
దర్శకుడు సుకుమార్ నిర్మాత అవతారం ఎత్తి "కుమారి 21 ఎఫ్" అనే చిన్న చిత్రాన్ని నిర్మించాడు. అది సూపర్హిట్ అయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై దర్శకుడు అనే మరో మూవీ కూడా తీశాడు కానీ అది పరాజయం పాలు అయింది. దాంతో ఇక నిర్మాతగా సినిమాలకి ఫుల్స్టాప్ పెడుతారనుకున్నారంతా. ఐతే "రంగస్థలం" సినిమాతో దర్శకుడిగా సుకుమార్ రేంజ్ మారిపోయింది. సుకుమార్ బ్రాండ్ నేమ్ కూడా మరింతగా పెరిగింది. దాంతో ఇపుడు ఆయన ప్రొడక్షన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు, నాలుగు సినిమాలను తన బ్యానర్పై నిర్మించనున్నాడు.