వచ్చీ రావడంతోనే భారీ సినిమాల బ్యానర్ గా పేరుతెచ్చుకుంది. మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి భారీ బడ్జెట్ మూవీ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి మరో బిగ్ బడ్జెట్ మూవీ చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో బడా మూవీ చేస్తోంది. ఇలా వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక్కసారిగా ట్రాక్ మార్చింది. మీడియం రేంజ్ బడ్జెట్ మూవీని లైన్లో పెట్టింది.