ఎన్టీఆర్ మరోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయంలో దొరికిపోయాడు తారక్. నిన్న స్వర్గీయ ఎన్టీ రామారావు వర్థంతి. సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించాడు యంగ్ టైగర్. ఇంతవరకు అంతా బాగానే ఉంది, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
హీరోలంతా ఇప్పుడు భలేగా కలిసిపోతున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్ కు మరొకరు ప్రత్యేక అతిథులుగా హాజరై అన్యోన్యత చాటుకుంటున్నారు. మొన్నటికిమొన్న "భరత్ అనే నేను" సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్, ఈసారి అఖిల్ తో కలిసి వేదిక పంచుకోబోతున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎల్లుండి (19-శనివారం) "మిస్టర్ మజ్ను" ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరవబోతున్నాడు యంగ్ టైగర్.
పూరి రూపొందించిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ని సక్సెస్ రూట్లోకి తీసుకొచ్చింది. టెంపర్కి ముందు అపజయాలతో సతమతమవుతున్నాడు జూనియర్. ఇది భారీ విజయం సాధించికపోయినా.. ఓ మోస్తారు విజయంతో పాటు నటుడిగా మరోసారి మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలాగే సిక్స్ప్యాక్ బాడీకి బాటలు వేసింది.
నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి, ఆ పార్టీ కలాపాలకి గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ని ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలోకి దించాలని వ్యూహం పన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కల్యాణ్రామ్ కుటుంబంలో ఒకరికి టికెట్ వస్తే జూనియర్ తన బెట్టుని గట్టు మీద పెట్టక తప్పదని బాబుకి తెలుసు. తాజా సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ కూకట్పల్లిలో ప్రచారం చేసేందుకు అంగీకరించాడట. అంటే బాబు ప్లాన్ ఫలించింది.