నందమూరి హరికృష్ణకిఅశ్రునయనాలతో వీడుకోలు పలికింది అభిమాన గణం.. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్రామ్ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్తో పాటు పలువు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను వేడుకుంటున్నాడు యువ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ. బిగ్బాస్ షోలో పాల్గొని, ఆ తర్వాత దాని నుంచి బయటికి వచ్చిన ఆదర్శ్ బాలకృష్ణకి ఎన్టీఆర్ అభిమానుల నుంచి సమస్య మొదలైంది.
ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్లో పాల్గొన్నాడు ఆదర్శ్. ఈ సినిమాలో ఆదర్శ్ది అతిథి పాత్ర. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో తాను చిన్న పాత్ర చేసిన ఆనందంలో ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ఒక ఫోటో కూడా షేర్ చేశాడు. ఫోటోతో సమస్య రాలేదు కానీ ఆ పోస్ట్లో జూనియర్ ఎన్టీఆర్కి గౌరవం ఇవ్వలేదని అభిమానులకి కోపం వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్కిపుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో అన్ని వర్గాలకి చేరువయి అయ్యాడు. సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ పొందాడు. ఆఖరికి మహేష్బాబులాంటి అగ్రహీరో కూడా జూనియర్ని తన సినిమా ఈవెంట్కి గెస్ట్గా పిలవాల్సి వచ్చింది. ఆ రేంజ్లో జూనియర్ ఇపుడు పాపులర్ అయ్యాడు. ఇక చరణ్తో ఎన్టీఆర్కున్న దోస్తీ కారణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్కి ఫిదా అయిపోయారు. అందుకే జూనియర్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.