నందమూరి సుహాసిని కోసం నందమూరి బాలకృష్ణ ప్రచారంలోకి దిగాడు. ఆమెతో పాటు ఇతర తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తరఫున మరో రెండు రోజులు ప్రచారం చేయనున్నాడు బాలయ్య. ఐతే, సుహాసిని కోసం కల్యాణ్రామ్, జూనియర్లో చివరి నిమిషంలో రంగంలోకి దిగుతారని ఇప్పటి వరకు టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.