ఎన్టీఆర్ బయోపిక్ స్ర్కిప్ట్ని మొదట రూపొందించింది డాక్టర్ ఎల్.శ్రీనాథ్. కుబుసం వంటి సినిమాలు తీసిన దర్శకుడు శ్రీనాథ్...నిర్మాత విష్ణు ఇందూరి ప్రోత్సాహంతో ఎన్టీఆర్ జీవిత కథని స్ర్కిప్ట్గా రాశాడు. ఆ కథని దర్శకుడు తేజ కొంత డ్రమటైజ్ చేశారు. అలా మొదలైంది ఎన్టీఆర్ మూవీ.
ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పటి వరకు రాకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే ఆ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యగా ఆమెకి మాత్రం భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరికీ ఇష్టం లేదు. లక్ష్మీపార్వతిని వారు తమ కుటుంబ సభ్యురాలిగా ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు గుర్తించడం లేదు.