"మనం" సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగార్జున పాత్ర గుర్తుందా. ఓ జమీందార్ పాత్రలో కనిపించిన నాగార్జునకు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చితే ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా ఆ కారును సొంతం చేసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి పాత్రనే ఇప్పుడు ప్రభాస్ కూడా పోషిస్తున్నాడు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో వింటేజ్ కార్లు కొనే ధనవంతుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ వివరాల్ని స్వయంగా వెల్లడించాడు.
పెళ్లి తర్వాత కూడా శ్రియా బిజీగా మారాలని చాలా ప్రయత్నించింది. పెళ్లితోనే తన కెరియర్కి ఎండ్కార్డ్ పడొద్దని ఆమె చాలా ట్రై చేస్తోంది. కానీ ఈ ఆర్నెళ్ల కాలంలో ఆమెకి కొత్తగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల విడుదలైన వీర భోగ వసంత రాయలు దారుణంగా పరాజయం పాలైంది.
రజనీకాంత్ కొత్త సినిమాలో అవకాశం వస్తుందని చాలా ఆశపడింది. అది కూడా నెరవేరలేదు. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వంటి సీనియర్ హీరోలు కూడా శ్రియాతో జతకట్టడం లేదు ఇపుడు. మొత్తమ్మీద పెళ్లి తర్వాత శ్రియాకి ఆఫర్లు డ్రై అయ్యాయి.