సోనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్ లో క్యాన్సర్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు న్యూయార్క్ వెళ్లి సోనాలిని కలిసి వచ్చారు. రీసెంట్ గా మహేష్ భార్య నమ్రత కూడా సోనాలినీ పరామర్శించింది.
మహర్షి షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన మహేష్, షెడ్యూల్ కంటే కాస్త ముందే కుటుంబంతో కలిసి అక్కడ ల్యాండ్ అయ్యాడు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కొన్ని రోజులు అమెరికాలో ఎంజాయ్ చేసిన తర్వాత మహర్షి సినిమా సెట్స్ పైకి వెళ్లాడు. అదే టైమ్ లో ప్రత్యేకంగా సోనాలిని కలిసింది నమ్రత.
న్యూ ఇయర్ జోష్ నుంచి మహేష్ బాబు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ హీరో కుటుంబంతో పాటు ఒమన్ లో విహరిస్తున్నాడు. ఒమన్ లో మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని నమ్రత ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది.
తాజాగా మహేష్, తన కుమారుడు గౌతమ్ తో కలిసి పారా గ్లైడింగ్ చేశాడు. ప్రస్తుతం ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుల్ ఎంజాయ్ మెంట్ మూడ్ లో మహేష్ ఉన్న ఫొటోలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
మహేష్ జోష్ చూస్తుంటే.. స్పైడర్ ఫ్లాప్ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్టు కనిపిస్తోంది.