నయనతార, విఘ్నేష్ శివన్ సహజీవనం కొత్తగా చెప్పేదేముంది. అది అందరికీ తెలిసిన మేటరే. తాము ఒక జంట అనే విషయాన్ని విషయాన్ని ఈ జంట సక్సెస్ ఫుల్ గా జనాలకు మెసేజ్ని ఫార్వర్డ్ చేయగలిగింది. వారు భార్యభర్తలా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా, కేవలం సహజీవనం చేస్తున్న మాడ్రన్ కపులా, అన్న వాదాలు పనిలేని మనకి సంబంధించిన విషయాలు. వారికి వారి విషయంలో ఫుల్లు క్లారిటీ ఉందట. ఐతే కలిసి ఉంటున్న తర్వాత తొలిసారిగా నయనతారకు సంబంధించిన అకేషన్ ను విఘ్నేష్ సెలబ్రేట్ చేశాడు.
నయనతారకి పెళ్లి కాలేదని మనందరికీ తెలుసు. అయితే కోలీవుడ్లో మాత్రం ఒక గుస గుస ఎపుడూ వినిపిస్తూనే ఉంటుంది. అదే నయనతారకి ఆల్రెడీ పెళ్లయిపోయిందని, కానీ ఆ విషయాన్ని ఆమె చెప్పడం లేదనేది ఆ గాసిప్. యువ దర్శకుడు విగ్నేష్ శివన్తో ఆమె కలిసే జీవిస్తోంది. మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందన్నట్లుగా ఆ మధ్య నయనతార ఒక మాట చెప్పింది. ఇద్దరూ కలిసే ప్రపంచం అంతా తిరుగుతున్నారు.
తమిళనాట అమ్మ బయోపిక్లకి డిమాండ్ ఎక్కువగా ఉంది. జయలలిత బయోపిక్ని తీస్తున్నామని ఇప్పటికే ముగ్గురు ఫిల్మ్మేకర్స్ ప్రకటించారు. అందులో ఒక దర్శకరాలు ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు షురూ చేసింది. ఇందులో నిత్యమీనన్ జయలలితగా నటించనుందట.
ఇక దర్శకుడు ఎ.ఎల్.విజయ్ విద్యాబాలన్ కథానాయికగా జయలలిత బయోపిక్ని తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి ఈ సినిమాని తీయనున్నారు.
లేడీ సూపర్స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విగ్నేష్ దేశ, విదేశాల్లో తెగ చక్కర్లు కొడుతున్నారు. నయనతార ఇపుడు కోలీవుడ్లో నెంబర్వన్ హీరోయిన్. సినిమాకి మూడు కోట్ల రూపాయలకి తక్కువ తీసుకోవడం లేదు. ఆమె డేట్స్ దొరకాలన్నా కష్టం. ఐతే విగ్నేష్తో తీర్థయాత్రలకి, ప్రేమయాత్రలకి మాత్రం రెగ్యులర్గా టైమ్ కేటాయిస్తుంటుంది.