పూజా హెగ్డేకి ఈ రోజు ఇంత క్రేజ్ రావడానికి కారణం హరీష్ శంకర్. తెలుగులో విజయాలు లేక బాలీవుడ్కి వెళ్లిన పూజని దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్గా తీసుకొని ఆమెని పాపులర్ చేశాడు. ఆ తర్వాత రంగస్థలం, అరవింద సమేత, మహర్సి ..ఇలా పలు బడా సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం బన్ని, ప్రభాస్ సరసన నటిస్తోంది. ఐతే ఈ భామని ఒక కీలక పాత్రలో తీసుకోవాలనుకున్నాడు హరీష్ శంకర్.