తిరుమల తిరుపతి దేవుణ్ని దర్శించుకొన్నాడు అల్లు అర్జున్. ఎల్లుండి విడుదల కానున్న తన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నాడట. తన ప్రతి సినిమా విడుదలకి ముందు తిరుమల వెంకటేశ్వురుడిని నిర్మాత దిల్రాజు దర్శించుకుంటాడు. ఆయన శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయన బ్యానర్ పేరు కూడా అదే. ఈసారి తనతో పాటు బన్నిని కూడా తిరుమలకి తీసుకెళ్లాడు.
ప్రస్తుతం పూజా హెగ్డేపై అంతా ఇలాంటి బెట్టింగ్ లే కాస్తున్నారు. ఎందుకంటే తెలుగులో ఆమెకన్నీ ఫ్లాపులే వచ్చాయి. దీంతో గ్యాప్ కూడా అనివార్యమైంది. ఇలాంటి టైమ్ లో డీజే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వరించింది పూజాకు. ఈ సినిమా క్లిక్ అయితే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ల రేసులోకి ఎంటర్ అవుతుంది. లేదంటే మాత్రం ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ గా మరోసారి ఫేడవుట్ అవ్వడం ఖాయం.