రేవతి అని హెడ్లైన్ చూసి... మౌనరాగం, గాయం, అంకురం చిత్రాల నటి అనుకోవద్దు. రేవతి చౌదరి అనే వర్ధమాన నటి గురించి ఈ ప్రస్తావన. శివాజీ హీరోగా రూపొందిన ఓ సినిమాలోనూ, తారకరత్న సరసన కాకతీయుడు చిత్రంలోనూ నటించింది రేవతి చౌదరి. ఆమె పుట్టింది, పెరిగింది విజయవాడలోనే కానీ చాలా కాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నందున ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరింది. అన్నట్లు ఆమె నటించిన ఆ రెండూ సినిమాలు విడుదలకి నోచుకోలేదట!