పైసా ఖర్చు లేకుండా బీభత్సంగా ప్రచారం సంపాదించడం రాజమౌళికి మాత్రమే తెలుసు. బాహుబలితో ఈ విషయం అందరికీ తెలిసొచ్చింది. సరిగ్గా ఇప్పుడు అదే ఫార్ములాను తన నెక్ట్స్ మూవీకి కూడా అప్లయ్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు...రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన తొలి రోజు నుంచే అఫీషియల్ గా ప్రచారం స్టార్ట్ చేశాడు జక్కన్న.
తను ఏ సినిమా స్టార్ట్ చేసినా కొబ్బరికాయ కొట్టిన రోజే కథను కాస్త రివీల్ చేయడం రాజమౌళి స్టయిల్. ఈగ సినిమా ఓపెనింగ్ రోజైతే టోటల్ కథ మొత్తం చెప్పేశాడు. మర్యాదరామన్న టైమ్ లో కూడా స్టోరీలైన్ బయటపెట్టాడు. బాహుబలికి కూడా ట్విస్టులు చెప్పకపోయినా స్టోరీలైన్ చెప్పేశాడు. సో.. తన నెక్ట్స్ సినిమా కథ ముందే చెబుతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.