భరత్ అనే నేను సినిమా సక్సెస్ఫుల్గా 50 రోజులు పూర్తి చేసుకొంది. మహేష్బాబు కెరియర్లో ఆల్టైమ్ నెంబర్వన్గా నిలిచింది. నిర్మాత, దర్శకుడు, బయ్యర్లు...అందరూ ఎపుడో తమ లావాదేవీలను సెటిల్ చేసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించి అకౌంట్స్ క్లోజ్ అయి చాలా కాలమయింది. మరి సడెన్గా ఇపుడు దానయ్యకి వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం మొదలైంది?
డైరక్టర్కి, హీరోయిన్కి, అలాగే మరో ఇద్దరు సాంకేతిక నిపుణులకి దానయ్య పారితోషికం ఎగ్గొట్టాడనే వార్త రావడమే విచిత్రంగా ఉంది. అయిపోయిన పెళ్లికి ఏదో అన్నట్లు దానయ్యకి వ్యతిరేకంగా ప్రచారం షురూచేయడం వెనుకున్న అసలు లోగుట్టు ఏంటి?