మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభం అయింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ మూవీని ఆగస్ట్ 15న ప్రారంభించాలనుకున్నారు. కానీ ఆ రోజు ముహూర్తం బాలేదట. ఆగస్ట్ 16న మంచి ముహూర్తం ఉండడంతో సింపుల్గా పూజా కార్యక్రమాలని నిర్వహించారు. భారీ లాంచ్ వచ్చే నెలలో ఉంటుంది.