"రాములో రాములా" అనే పాటని ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తామని ప్రకటించింది అల్లు అర్జున్, త్రివిక్రమ్ టీం. కానీ ఈ పాట విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 22 సాయంత్రం 4 గంటలకి ఈ పాట వస్తుందట. అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇది పార్టీ సాంగ్ అని చెప్తోంది టీం. ఇంతకుముందు వచ్చిన "సామజవరాగమనా" అనే పాట బాగా వైరల్ అయింది. తెలుగు సినిమాల్లోనే అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ రాములో రాములా పాట .. పార్టీల్లో, సంగీత్ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా మోగే రేంజీలో ఉంటుందంట. థమన్ స్వరపరిచిన ఈ సాంగ్.. "ఆల వైకుంఠపురంలో" నుంచి రానుంది.
పూజ హెగ్డేకి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఈ రోజు ఆమెకి వచ్చిన విషెస్ ఒక ఉదాహరణ. నేడు ఆమె బర్త్ డే. పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ నటిస్తున్న 'ఆలా వైకుంఠాపురంలో', ప్రభాస్ కొత్త సినిమా మేకర్స్ ... ఆమె కోసం స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్.
ఒక హీరోయిన్ కోసం ..పెద్ద హీరోల సినిమాల నిర్మాతలు కూడా బర్త్ డే పోస్టర్లు రిలీజ్ చేసారంటే ..దాని అర్థం ఆమె రేంజ్ చాలా ఎక్కవ అని. పూజ హెగ్డే తక్కువ టైంలో ఆ రేంజ్ కి ఎదిగింది. ఈ ఏడాది ఇప్పటికే 'గద్దలకొండ గణేష్' సినిమాలో చిన్న పాత్రకే కోటిన్నర పారితోషికం తీసుకొని తనకున్న క్రేజ్ ఏంటో చూపించింది.